SPL6 LIVE NEWS(డిజిటల్ మీడియా నెట్వర్క్).
అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ రూ.8 లక్షల విలువైన LOCలను అందజేశారు.
నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్లూరు మండలం నారాయపురం గ్రామానికి చెందిన కీసర లక్ష్మికి రూ.3 లక్షల LOC, పెనుబల్లి మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన మారిని నాగశేషు కి రూ.5 లక్షల LOC ఎమ్మెల్యే రాగమయి దయానంద్ అందించారు. బాధితులకు వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే ఈ ఆర్థిక సహాయం అందజేశారు. ఆపద సమయంలో అండగా నిలిచిన ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ కి బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు.