ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం గ్రామంలో రాజిని.వెంకటేశ్వరరావు 45 సంవత్సరములు. కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం అందుకున్న సత్తుపల్లి 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గొల్లమందల. కృష్ణ. పైలెట్ ఏకాంత్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడికక్కడే ప్రాథమిక వైద్యం చేస్తూ అంబులెన్స్ లో ఎక్కించుకొని సత్తుపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు,
సత్తుపల్లి మండలం గౌరీగూడెం గ్రామానికి చెందిన కాశిని గాంధీ కుటుంబంలోని గొడవల కారణంగా శుక్రవారం పురుగులు మందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం మేరకు సత్తుపల్లి 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గొల్లమందల కృష్ణ పైలట్ ఏకాంత్ తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని పురుగు మందు తాగిన గాంధీకి ప్రాథమిక వైద్యం సేవలు అందిస్తూ సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ రెండు సంఘటనాలలో సమాచారం అందుకొని తక్షణమే స్పందించిన సత్తుపల్లి 108 సిబ్బందిని చంద్రాయపాలెం గ్రామస్తులు 108 జిల్లా మేనేజర్ అవులూరి.దుర్గాప్రసాద్, ప్రోగ్రాం మేనేజర్ షేక్. నజీరుద్దీన్ అభినందించారు