ఫిరోజాబాద్ (UP), జూన్ 09 (TV6 24/7 NEWS).
కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ బైకర్ ప్రాణం పోయిందని. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో రోడ్డు పక్కన కారు ఆపిన వ్యక్తి డోర్ను ఒక్కసారిగా తెరవడంతో, వెనుక నుంచి వేగంగా వచ్చిన మోటార్ సైకిల్ దాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరిలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన సిసిటివి (CCTV) ఫుటేజ్ ప్రస్తుతం తుషార్ రాయ్ అనే వ్యక్తి తన X ఖాతాలో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.