గత కొంతకాలంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణకు వ్యతిరేకంగా స్వరాలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు కూడా జనాభా నియంత్రణపై ఇటీవల వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఒకరిద్దరి కంటే ఎక్కువ మందిని కన్నా వారికి ఏపీ సీఎం చంద్రబాబు శనివారం చంద్రబాబు బంపర్ ఆఫర్ క్రింద నగదు ప్రోత్సాహక బహుమతి ప్రకటించారు.
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారంశ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు మూడో సంతానం కన్నవారికి రూ. 30 వేలు, నాలుగో సంతానం కన్నవారికి రూ.40 వేలు అప్పటికప్పుడే ప్రోత్సాహకం గా ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రకటించారు.