SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). రెండు తెలుగు రాష్ట్రాలలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ రింగ్ సెంటర్లో ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా నివాళులు అర్పించడానికి ఘనంగా ఏర్పాటు చేయగా టిజిఐడిసి చైర్మన్ మువ్వా విజయబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మువ్వా విజయ్ బాబు ఎన్టీఆర్ చేసిన సేవలను ఒకసారి ప్రజలకు గుర్తు చేశారు.