TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని చారిత్రాత్మక శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని (గణపేశ్వరాలయం) రూ.3.30 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణ, అభివృద్ధి పనులకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పొంగలేటి వెంట టి.ఎస్, రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అర్చకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తులు ఉన్నారు.